ఎస్సీ ల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా..
ఎస్సీ ల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా..
షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా
కే.ఎస్. జవహర్, చైర్మన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ ఫ్లోర్ గల ఎస్సీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కుటుంబ సభ్యుల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నాకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు.. రాష్ట్రంలోని ఎస్సీల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని పనిచేస్తానన్నారు.. గతంలో ఎన్నడూ లేనివిధగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.. రాష్ట్రం లోని దళితులందరూ కూటమి పాలనలో ఏంతో సంతోషంగా ఉన్నారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలేనన్నారు.
గతంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగాయన్నారు.. రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందన్నారు.. సమసమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు. ముందుగా ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కేఎస్ జవహర్ ను నియమించటం దళితులందరికీ సంతోషదాయకమన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, ఎమ్మెస్ రాజు, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా లు పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ బత్తుల జీవపుత్ర కుమార్, చైర్మన్ పీ.ఎస్ ఎల్.ఎమ్ కిషోర్, తదితరలు పాల్గొన్నారు.
అనంతరం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన అభినంధన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసనసభ్యులు బండారు సత్యానందరావు, తంగిరాల సౌమ్య, వేగుళ్ల జోగేశ్వరావు, పితాని సత్యారాయణ, ఎస్సీ మాల సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని చైర్మన్ ను బొకేలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.