రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయండి

రేషన్ బియ్యం పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ 

పెనుకొండ : పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని మంత్రి సవితమ్మ రేషన్ డీలర్లకు తెలిపారు. పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2 నూతన రేషన్ డీలర్ షాపులను మంత్రి సవితమ్మ జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించారని MDU వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒక చోట ఇవ్వడం జరిగిందని, వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బంది పడేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమకు వీలైన సమయంలో ఏ స్టోర్ వద్ద అయినా 1 తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు సులువుగా సరైన తూకం తో తీసుకోవచ్చు అన్నారు అదేవిధంగా 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు వికలాంగులకు ఎటువంటి ఆఆటంకం కలవకుండా వారింటి వద్దకే డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఒక్కో ఎండీయూ ఆపరేటర్ కు 21,000 జీతాలు చెల్లించే వారిని దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 233 కోట్ల భారం పడిందని ప్రజాధనం వృధా అయ్యిందని మంత్రి సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అనందరావు గారు,MRO శ్రీధర్ ఇతర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-