ప్రభుత్వ ఆదేశాల మేర మద్దతు ధర అందిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేర మద్దతు ధర అందిస్తాం
టోకెన్ పద్ధతి ద్వారా వ్యాపారులకు మరియు పల్ప్ యూనిట్లకు సరుకు అందజేయబడుతుంది
మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి కే జి వరకు మామిడి కొనుగోలు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, జూన్ 19 : జిల్లాలో పండే మామిడికి చిట్టచివరి కాయ అమ్ముడుపోయే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వం అందించే 4 రూపాయలు
మద్దతు ధర సబ్సిడీ రూపంలో రైతు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుందని
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
గురువారం సాయంత్రం బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లో మామిడి మండి యాజమానులు, రైతులతో మామిడి మద్దతు ధర పై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ తోతాపురి మామిడిని చివరి కేజీ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు ఆందోళన చెంది పక్వానికి రాక మునుపే మామిడి కాయలను గుజ్జు పరిశ్రమలకు తరలించవద్దని సూచించారు. మండలాల్లో గ్రామ సభల ద్వారా మామిడి అమ్మకం పై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రైతులు ట్రేడర్స్ పైన ఆధార పడవద్దు. చిన్న సన్నకారు మామిడికాయ రైతులు పక్వానికి వచ్చిన మామిడికాయలని కంపెనీలకు తరలించాలని రైతులకు పిలుపునిచ్చారు. క్రిష్ణగిరికి జిల్లా అధికారుల కమిటీతో ఒక బృందం పంపడం జరిగిందని అక్కడ కొనుగోలు ఎలా జరుగుతున్నాయి వాటిని ఎలా అమలు చేస్తున్నారు రైతులకు ఎలాంటి రుసుము అందజేస్తున్నారు తెలుసుకోవడానికి బృందం పంపడం జరిగిందని రెండు రోజుల్లో బృందం నివేదికలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తోటాపురి రైతులు ఫ్యాక్టరీలకు అమ్మిన, వర్తకులకు మామిడికాయల అమ్మిన, భూమి పైన ఉన్న మామిడి పంటని వర్తకులు అమ్మిన వారికి ప్రభుత్వం తరఫున కిలోకి నాలుగు రూపాయలు సబ్సిడీ అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు మామిడి రైతులకు సలహాలు, సూచనల కొరకు ప్రొసెసింగ్ యూనిట్ల వద్ద షిఫ్ట్ ల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం జరిగిందన్నారు. మన జిల్లాలో మామిడి పండించే రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ముఖ్య మంత్రి వర్యుల నిర్ణయం మేరకు ప్రతి రైతుకు కేజీ కి రూ.4 చొప్పున వారికి మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉద్యోగులను, తాహసిల్దార్లను పెట్టి ఎక్కడెక్కడ ఎంత మామిడి వస్తుంది, ఏ వ్యాపారి కొంటున్నారు, ఎటువైపు వెళ్తుంది, ఏ రైతు నుండి కొన్నారు తదితర వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా రైతులకు మనదగ్గర పండేటటువంటి మామిడి కాయలకు చిట్టచివరి దాకా జూన్ మొదటి వారం నుండి జూలై, ఆగస్టు నెల చివరి కాయ వరకు ఎంత పంట వస్తుందో దానంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం వారు అందించే 4 రూపాయల మద్దతు ధర ఆగిపోతుందనే అపోహ వలన ఎక్కువ మంది రైతులు పంటని కోత చేసి త్వరగా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారని, పల్ప్ యూనిట్ యొక్క స్టోరేజ్ సామర్థ్యం, ప్రొసెసింగ్ సామర్థ్యానికి మించి మనము తీసుకెళ్తే అక్కడ వెయిటింగ్ టైమ్ పెరుగుతుందన్నారు. దానిని నివారించడానికి మామిడి రైతులందరూ నెమ్మదిగా పక్వానికి వచ్చినటువంటి కాయలను మాత్రమే తీసుకురావాలని, ఆగస్టు మొదటి వారం వరకు చివరి కాయవరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యాన వాన శాఖ ద్వారా ఏ ఏ రైతు పంట ఎప్పుడు కోతకు వస్తుందో నిర్ణయించి వాటిని వ్యాపారులతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటివరకు వివిధ ఫ్యాక్టరీలలో 60 వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయని తెలిపారు, ఫ్యాక్టరీలు రాంపులు వద్ద ధరలు పట్టిక తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. మన మామిడి పంటను ఇతర రాష్ట్రాలు పంపడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని, గుజరాత్ బలగామ మార్కెట్ ప్రదేశాలలో తరలించడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుని ఎగుమతి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, మార్కెటింగ్ ఏడి పరమేశ్వరం ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.