రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పెన్షన్ల పంపిణీలో రాజీ ఉండరాదు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

పెన్షన్ల పంపిణీలో రాజీ ఉండరాదు

  •  ఎక్కడ లోపాలు లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి
  •  ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందించడం చేయాలి
  •  పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బు తీసుకోవడం చేయరాదు
  •  సిబ్బంది ప్రవర్తన బాగుండాలి
  •  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

అనంతపురం, జూన్ 03 :

  • పెన్షన్ల పంపిణీలో ఎలాంటి రాజీ ఉండరాదని, సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో పెన్షన్ల పంపిణీలో ఫీడ్ బ్యాక్ పై వెనుకబడిన మండలాల సచివాలయ ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ విషయమై సచివాలయ ఉద్యోగులు మనస్సాక్షితో సరైన విధంగా పని చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ సమయంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటించి రియాలిటీ చెక్ చేస్తామని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను ఖచ్చితంగా అందించడం చేయాలని, ఎవరైనా చెట్టు కింద ఇస్తే చర్యలు తీసుకుంటామని, పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బు తీసుకోవడం ఉండరాదని, సిబ్బంది ప్రవర్తన బాగుండాలని, లబ్ధిదారులకు నమస్కారం చేయాలని, ప్రభుత్వం మెసేజ్ ని వినిపించాలని, ఇందులో నిర్లక్ష్యం వహించరాదన్నారు. గ్రామస్థాయి అధికారులు చేసే పనులను చక్కగా చేసేలా డిఆర్డిఏ పిడి, డిపిఓలు దృష్టి పెట్టాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందించడం, పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బు తీసుకోవడం చేయరాదు, సిబ్బంది ప్రవర్తన బాగుండాలి అనే అంశాలను అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే దిశానిర్దేశాలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. వచ్చేనెల ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను తాను తనిఖీ చేస్తానని, అలాంటి సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ, డీఆర్డీఏ పీడిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో సరైన విధంగా పని చేస్తే ఎలాంటి చర్యలు ఉండవని, ఎలాంటి రాజీ లేకుండా బాగా పనిచేయాలని ఆదేశించారు.
  • ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి శైలజ, ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-