రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభం

Narendra Modi Chenab Bridge Railway Bridge Jammu Kashmir Udhampur Srinagar Baramulla Rail Link USBRL Project Vande Bharat Katra Srinagar Indian R
Mounikadesk

Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభం 

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభానికి సర్వం సిద్ధం..
  • శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను జాతికి అంకితం..
  • ఈ వంతెన మీదుగా వందే భారత్ రైళ్లు..
  • కాట్రా-శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గింపు..
  • కాట్రాలో రూ.46,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం‌‌..

జమ్మూకశ్మీర్ రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ వంతెనపై వందే భారత్ రైళ్ల రాకపోకలతో కాట్రా-శ్రీనగర్ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇది 'నయా కాశ్మీర్' నిర్మాణంలో కీలక ఘట్టమని ప్రధాని పేర్కొన్నారు.

చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున, 1,315 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం, ప్రాంతీయ అనుసంధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భూకంపాలు, బలమైన గాలులను తట్టుకునేలా పటిష్టంగా నిర్మించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. దీనిపై వందే భారత్ రైలు ప్రయాణంతో కాట్రా నుంచి శ్రీనగర్‌కు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చని, ప్రస్తుత సమయం కన్నా 2-3 గంటలు ఆదా అవుతుందని పీఎంఓ వివరించింది. కీలకమైన ఈ ప్రాంతంలో మౌలిక వసతుల పెంపుదలకు, అనుసంధానతను పెంచాలన్న ప్రధాని మోదీ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆ ప్రకటన పేర్కొంది.

చీనాబ్ వంతెనతో పాటు, కాట్రాలో ప్రధాని రూ.46,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు కూడా మోదీ ఎల్లుండి శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో దేశంలోనే తొలి కేబుల్ ఆధారిత రైలు వంతెన కూడా ఉంది. ఇది కఠినమైన భూభాగంలో సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించబడింది.

ఇంకా, సుమారు రూ.43,780 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టునూ ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇందులో 119 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 36 సొరంగాలు, 943 వంతెనలున్నాయి. ఇది కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అన్ని కాలాల్లోనూ నిరంతరాయమైన రవాణా సౌకర్యం కల్పిస్తూ, ప్రాంతీయ రవాణాను సమూలంగా మార్చి సామాజిక-ఆర్థిక సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని పలు రహదారి ప్రాజెక్టులకు, రియాసీ జిల్లాలో వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో కాట్రాలో రూ.350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న  మాతా వైష్ణో దేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు

Comments

-Advertisement-