రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైతుల‌ను ఇబ్బందిపెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు ఆగ‌స్టు 15 నాటికి భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రైతుల‌ను ఇబ్బందిపెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు ఆగ‌స్టు 15 నాటికి భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

ఈరోజు డాక్ట‌ర్ బి.ఆర్.అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సహచర మంత్రులు @Ponnam_INC , @minister_adluri , చీఫ్ సెక్ర‌ట‌రీ కె.రామ‌కృష్ణారావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. 

తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దే. 

మూడు ద‌ఫాలుగా నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సామాన్యుల‌ను ముఖ్యంగా రైతుల‌ను ఇబ్బంది పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు. సస్సెండ్ చేయ‌డానికైనా వెనుకాడ‌బోము. క్షేత్ర‌స్ధాయిలో కొంత‌మంది అధికారులు రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌నే స‌మాచారం ఉంది. ఇది పున‌రావృతం కాకుండా క‌లెక్ట‌ర్లు చూడాలి.

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వచ్చిన 8.65ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల్లో ప్ర‌ధానంగా సాదాబైనామా,స‌ర్వేనెంబ‌ర్ మిస్సింగ్‌,అసైన్డ్ ల్యాండ్ ,అసైన్డ్ ల్యాండ్ రెగ్యుల‌రైజేష‌న్‌,సక్సెష‌న్ కు సంబంధించి సుమారు 6 ల‌క్ష‌లున్నాయి. వీటిని ఐదు విభాగాలుగా విభ‌జించి ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీల‌న జ‌రిపి ఆగ‌స్లు 15వ తేదీలోగా వీలైన‌న్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాలి. 

సాదాబైనామాల అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని కోర్టు తీర్పుకోసం వేచిచూడ‌కుండా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ప‌రిష్కారం కోసం సిద్దం చేసుకోవాలి. జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్,ల‌బ్దిదారుల వివ‌రాల‌ను ఈ నెల 30వ తేదీ లోగా ప్ర‌భుత్వానికి పంపించాలి.


  • ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌ను త‌గ్గించుకోవ‌డానికి ఇష్టం వ‌చ్చిన రీతిలో తిర‌స్క‌రించ‌కూడ‌దు. తిర‌స్కారానికి గ‌ల కార‌ణాల‌ను లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారునికి తెలియ‌జేయాలి. ఈనెల 27వ తేదీన జరిగే జీపీవోల‌కు,లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల‌కు ప‌రీక్షలను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి.
  • పేద‌వాడి సొంతింటి క‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మ‌ాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. చెల్లింపులు, ఇసుక,సిమ్మెంట్,స్టీల్ ధ‌ర‌ల విష‌యంలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాలి. అలాగే ధ‌ర‌ల నియంత్ర‌ణ కమిటీ చురుగ్గా ప‌నిచేసేలా క‌లెక్ట‌ర్లు నిత్యం ప‌ర్య‌వేక్షణ నిర్వహించాలి. 
  • ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక‌ స‌రైన విధంగా ల‌బ్దిదారుల‌కు చేరేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాలి. ల‌బ్దిదారుల‌పై ర‌వాణా భారం అధికంగా ప‌డ‌కుండా వీలైనంత దగ్గ‌ర‌లో ఇసుక అందేవిధంగా చూడాలి. బేస్‌మెంట్ నిర్మాణం కోసం అక్క‌డ‌క్క‌డ అందుబాటులో ఉన్న మ‌ట్టిని తీసుకెళ్తున్న ల‌బ్దిదారుల‌పై పోలీసులు కేసులు న‌మోదుచేయ‌డం స‌రైన చ‌ర్య కాదు. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల‌తో సంబంధం లేకుండా నిరుపేద‌లైతే ఇల్లు కేటాయించాలి.
  • రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్ర‌తి సోమ‌వారం బిల్లులు చెల్లింపులు జ‌రుపుతున్నప్పటికీ సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో కొంత‌మంది ల‌బ్దిదారుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ కావ‌డం లేదు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి ల‌బ్దిదారునికి ఇబ్బంది లేకుండా చూడాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల‌కు సంబంధించి స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి అర్హులైన ల‌బ్దిదారుల‌కు వీయినంత త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

Comments

-Advertisement-