ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో కొండంత చేశాం- గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నాం.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో కొండంత చేశాం- గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నాం.
ఈరోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో
ఐ & పి.ఆర్ స్పెషల్ కమిషనర్, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారితో కలిసి జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏడాదిన్నర కాలంలో ఎన్నోసంక్షేమ పధకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాము. ప్రభుత్వం సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలి. అప్పుడే మనం ఏం చేస్తున్నామనేది ప్రజలకు తెలుస్తుంది.
నాడు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చెయ్యని పనులను కూడా చేసినట్లుగా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టింది. నేడు ప్రతిపక్షంలో కూడా ఆ పార్టీ అదే
పద్ధతిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతుంది.
ఈ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లాస్ధాయిలో పౌరసంబంధాల శాఖ అధికారులదే.
ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని,
ప్రజా సంబంధాల శాఖ సమర్ధవంతంగా పనిచేసిప్పుడే ప్రభుత్వాల పనితీరు ప్రజలకు చేరువవుతుందని అధికారులకు సూచించడం జరిగింది.