రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పది పాసైన విద్యార్థులందరికీ శుభవార్త.. సంవత్సరానికి రూ.75 వేల వరకు స్కాలర్షిప్

VIDYADHAN SCHOLARSHIP LAST DATE VIDYADHAN SCHOLARSHIP 2025 APPLY FOR VIDYADHAN SCHOLARSHIP ABOUT VIDYADHAN SCHOLARSHIP APPLY FOR VIDYADHAN SCHOLAR
Mounikadesk

 పది పాసైన విద్యార్థులందరికీ శుభవార్త.. సంవత్సరానికి రూ.75 వేల వరకు స్కాలర్షిప్

  • 11 రాష్ట్రాల్లో ఉపకార వేతనాలు అందిస్తోన్న సరోజిని దామోదరన్‌ సంస్థ..
  • ఆన్లైన్లో ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు..

చదవాలనే తపన ఉన్నా, ఆర్థిక పరిస్థితి కారణంగా చాలా మంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థితిలో ఉండాలనే కోరకకు పేదరికం అడ్డుగా ఉంటోంది. ఈ క్రమంలోనే చదువుకోవాలనే కోరిక ఉన్న వారికి ఉపకార వేతనాలు అందించడమే గాక పై చదువులకు ప్రోత్సహిస్తోంది సరోజిని దామోదరన్‌ సంస్థ. ప్రతీ సంవత్సరం టెన్త్ క్లాస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు "విద్యాదాన్‌" పేరిట ఉపకార వేతనాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇంటర్‌తో పాటు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల ప్రతిభ, కోర్సు ప్రాతిపదికగా స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఎవరు అర్హులు? స్కాలర్షిప్ ఎంతొస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇంత మందికి లబ్ధి: ఈ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌, గోవా, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుతం 10వేల మందికి పైగా ఈ సంస్థ నుంచి ఉపకార వేతనాలు అందుకుంటున్నారు.


స్కాలర్షిప్ ఎంత:

ఇంటర్ రెండు సంవత్సరాలకు గానూ ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000/- స్కాలర్షిప్ ఇస్తారు. అంటే మొదటి సంవత్సరంలో పది వేలు, రెండో సంవత్సరంలో రూ.10 వేలు అందజేస్తారు. అలాగే ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులకు వెళ్లే అభ్యర్థులకు కోర్సు ప్రకారం ఏడాదికి రూ.10,000 నుంచి రూ.75,000 వరకు ఉపకారవేతనాలు అందిస్తారు.

ఎవరు అర్హులు:

ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకునే విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి.

2024-25 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి కనీసం 90% మార్కులతో ఉత్తీర్ణత లేదా 9 జీపీఏ సాధించిన వారు అర్హులు.

దివ్యాంగులైతే 75% మార్కులు లేదా 7.5 జీపీఏ సాధిస్తే చాలు.

కావాల్సిన పత్రాలు:

పదవ తరగతి మార్క్స్ మెమో(ఒరిజినల్ మెమో అందుబాటులో లేనివారు, SSC/CBSE/ICSE వెబ్సైట్ నుంచి పొందిన మార్క్షీట్ను అప్లోడ్ చేసుకోవచ్చు)

2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం

పాస్ఫొటో

ఇంటర్ కాలేజీ వివరాలు

దివ్యాంగులు అయితే ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం

ఉపకార వేతనాల కోసం అప్లై చేసే అభ్యర్థులకు వ్యక్తిగత ఈ-మెయిల్‌ ఐడీ ఉండాలి.

ఎంపిక విధానం:

స్కాలర్షిప్లకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మాత్రమే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఈ-మెయిల్/ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.

ముఖ్య తేదీలు:

తెలంగాణ: స్కాలర్షిప్లకు అప్లై చేసుకునేందుకు జులై 10 లాస్ట్ డేట్. అలాగే జులై 27 న పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆగస్టు 10 నుంచి 30వ తేదీ మధ్యలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్: స్కాలర్షిప్లకు అప్లై చేసుకునేందుకు జూన్ 30 లాస్ట్ డేట్. జులై 13 ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి జులై 19 నుంచి 31 మధ్యలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.

ఎలా అప్లై చేసుకోవాలంటే:

  • ముందుగా ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ www.vidyadhan.org ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో Apply for Scholarships ఆప్షన్పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో రైట్ సైడ్ కాలమ్లో Already Registered/ Login ఆప్షన్పై క్లిక్ చేయాలి.
  • మీరు అంతకుముందే రిజిష్టర్ అయితే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే మీరు కొత్తగా అప్లై చేసుకంటే Register ఆప్షన్పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి Register బటన్పై క్లిక్ చేయాలి.
  • మీ మెయిల్కు అకౌంట్ యాక్టివేట్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే విద్యాదాన్ లాగిన్ కాలమ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీ మెయిల్ ఐడీ, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు స్క్రీన్ మీద పలు రాష్ట్రాల వారీగా వివరాలు కనిపిస్తాయి. అందులో మీ రాష్ట్రానికి సంబంధించిన కాలమ్లో Apply Now ఆప్షన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ అందించిన సూచనల ప్రకారం అప్లికేషన్‌ పూర్తి చేసి కావాల్సిన డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను అప్లోడ్ చేసి చివరిగా Submit పై క్లిక్‌ చేస్తే దరఖాస్తు పూర్తయినట్లే.
  • మీరు ఈ స్కాలర్షిప్ కోసం పరీక్ష రాయడానికి సెలెక్ట్ అయ్యారో లేదా ఈ-మెయిల్‌కు వస్తాయి.
  • కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు మెయిల్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
  • ఈ ఉపకార వేతనానికి అప్లై చేసుకునేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
  • అలాగే దీనిని విద్యాదాన్ యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.







Comments

-Advertisement-