తెలుగు డయాస్పోరా ఆద్యంతం ఉత్సాహభరితం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
తెలుగు డయాస్పోరా ఆద్యంతం ఉత్సాహభరితం
- సింగపూర్లో 5 గంటల పాటు కొనసాగిన కార్యక్రమం
- ఐదారు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు… కిక్కిరిసిన ఆడిటోరియం
- రెండున్నర గంటలు ఓపిగ్గా అందరితో ఫోటోలు దిగిన సీఎం చంద్రబాబు
సింగపూర్, జూలై 27 : సింగపూర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు. తెలుగు ప్రజల ఆనందం, సంతోషాల నడుము సుమారు ఐదు గంటల పాటు పండుగలా డయాస్పోరా కార్యక్రమం సాగింది. 4వ సారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి సింగపూర్కు సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో భార్యాపిల్లలు, స్నేహితులతో కలిసి ఎన్ఆర్ఐలు డయాస్పోరాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి... కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో ఫోటోలు దిగారు. రెండున్నర గంటలపాటు ఓపిగ్గా నిలబడి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు ఫోటోలు దిగారు. ఫోటో దిగలేదన్న నిరూత్సాహం ఎవ్వరిలో లేకుండా ఉండేలా వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం ఫోటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుగువారు పంచుకున్నారు. పిల్లలతో సహా తెలుగు సాంప్రదాయంతో డయాస్పోరా కార్యక్రమానికి హాజరైన మహిళలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
Comments