ఐఆర్డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ నియామకం
ఐఆర్డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ నియామకం…
ముఖ్య ముఖ్యాంశాలు:
నియామకం: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (Insurance Regulatory and Development Au-thority of India - IRDAI) ఛైర్మన్గా అజయ్ సేథ్ను నియమిస్తూ ప్రభుత్వం జూలై 24న ప్రకటించింది.
పదవీకాలం: అజయ్ సేథ్ ఐఆర్డీఏఐ ఛైర్మన్గా మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు పదవిలో కొనసాగుతారు.
నియామక ప్రక్రియ:
ఈ ఏడాది మార్చిలో దేబాశిష్ పాండా పదవీకాలం ముగిసిన తర్వాత ఐఆర్డీఏఐ ఛైర్మన్ పదవి నాలుగు నెలల పాటు ఖాళీగా ఉంది.
కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ (FSRASC) అజయ్ సేథ్ పేరును సిఫార్సు చేయగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల సంఘం దీనికి ఆమోదం తెలిపింది.
ఐఆర్ డీఏఐ (IRDAI) - భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ
ఐ ఆర్ డి ఏ ఐ (IRDAI) అంటే Insurance Regulatory and Development Authority of India -
నియంత్రణ, అభివృద్ధి సంస్థ. ఇది భారతదేశంలో బీమా పరిశ్రమను నియంత్రించే మరియు అభివృద్ధి చేసే అత్యున్నత స్వయంప్రతిపత్త, శాసనబద్ధమైన సంస్థ. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
చరిత్ర మరియు ఏర్పాటు:
ఐఆర్ డీఏఐ చట్టం, 1999: భారత ప్రభుత్వం ఐఆర్డీఏఐ చట్టం, 1999ను ఆమోదించడం ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేసింది.
ప్రారంభం: 2000వ సంవత్సరంలో దీనిని ఒక స్వయంప్రతిపత్త సంస్థగా ఏర్పాటు చేశారు.
ముందున్న పరిస్థితి: ఐఆర్డీఏఐ ఏర్పడక ముందు, భారతదేశంలో బీమా రంగాన్ని 'కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్' (Controller of Insurance) పర్యవేక్షించేది.
ప్రధాన కార్యాలయం: ఐఆర్డీఏఐ ప్రధాన కార్యాలయం మొదట ఢిల్లీలో ఉండేది. ఆ తర్వాత 2014లో హైదరాబాదు మార్చబడింది.
ఐఆర్ డీఏఐ నిర్మాణం:
ఐఆర్డీఏఐలో ఒక ఛైర్మన్, ఐదుగురు పూర్తికాల సభ్యులు, మరియు నలుగురు పాక్షికకాల సభ్యులు ఉంటారు. వీరందరినీ భారత ప్రభుత్వం నియమిస్తుంది.