రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారతదేశ నూతన జాతీయ సహకార విధానం - 2025ని ప్రకటించిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా…

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భారతదేశ నూతన జాతీయ సహకార విధానం - 2025ని ప్రకటించిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా…

కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా జూలై 24 న న్యూఢిల్లీలోని అటల్ అక్షయ ఊర్జా భవన్ లో భారతదేశ నూతన జాతీయ సహకార విధానం- 2025ని ప్రకటించారు.

2002లో అప్పటి ప్రభుత్వం (అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో) తొలి సహకార విధానాన్ని ప్రకటించిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం (ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో) ఈ రెండవ నూతన విధానాన్ని రూపొందించింది. ఇది గత రెండు దశాబ్దాలలో వచ్చిన సామాజిక-ఆర్థిక, సాంకేతిక మార్పులకు అనుగుణంగా రూపొందించబడింది.

ఈ విధానాన్ని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలోని 48 మంది సభ్యుల కమిటీ రూపొందించింది.

ఈ కమిటీ దేశవ్యాప్తంగా 17 సమావేశాలు, 4 ప్రాంతీయ వర్క్షాప్లు నిర్వహించి, వాటాదారుల నుంచి 648 సూచనలను స్వీకరించింది.

ముఖ్య లక్ష్యాలు(2025-2045):

సహకార రంగ విస్తరణ: దేశంలోని ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సభ్యుల సంఖ్య పెంపు: 50 కోట్ల మంది ప్రజలను సహకార రంగ పరిధిలోకి తీసుకురావాలని తద్వారా సమానత్వ వృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆర్థిక నేరాలకు చెక్: సహకార సంస్థలను వృత్తిపరంగా, పారదర్శకంగా, సాంకేతికతతో కూడుకున్నవిగా, ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడం.

సహకార రంగ జీడీపీ వాటా వృద్ధి: 2034 నాటికి సహకార రంగం జీడీపీకి అందించే వాటాను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉపాధి కల్పన: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడం.

2047 నాటికి 'వికసిత్ భారత్' సాధన: సహకార రంగాన్ని 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక స్తంభంగా మార్చడం.

నూతన రంగాలలో విస్తరణ: పర్యాటకం, టాక్సీ సేవలు, బీమా, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో సహకార స్ఫూర్తిని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. టాక్సీ, బీమా రంగాల్లో త్వరలోనే ప్రారంభించనున్నారు.

ఆర్థిక ఆకాంక్షల సాధన: గ్రామీణ ప్రజల ఆకాంక్షలను (ఉదాహరణకు గ్యాస్ సిలిండర్, ఇల్లు పొందిన వారు ఇస్త్రీ పెట్టెలు, స్కూటీలు కొనుగోలు చేయాలనే ఆకాంక్షలు) నెరవేర్చడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

పాలన మరియు పర్యవేక్షణ: ఈ విధానం అమలును పర్యవేక్షించడానికి 'నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆన్

కోఆపరేషన్ పాలసీ' మరియు 'పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ' వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.

మోడల్ గ్రామాలు: ప్రతి తాలూకాలో ఐదు మోడల్ సహకార గ్రామాలను అభివృద్ధి చేయడం, మరియు ప్రతి జిల్లాలో ఒక మోడల్ సహకార గ్రామాన్ని బహుళార్ధసాధక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) కేంద్రంగా అభివృద్ధి చేయడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి.

సభ్య-కేంద్రీకృత విధానం: ఈ విధానం సభ్యుల సంక్షేమాన్ని ప్రాథమిక లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.

సమ్మిళిత అభివృద్ధి: దళితులు, ఆదివాసీలు, మహిళలు వంటి వెనుకబడిన వర్గాల భాగస్వామ్యాన్ని ఆర్థిక అభివృద్ధిలో పెంచడంపై విధానం దృష్టి పెట్టింది

Comments

-Advertisement-