రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మన డేటా భద్రమేనా!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

మన డేటా భద్రమేనా!

- మన డేటా ఎవరి చేతుల్లో?

- రోజూ ఉపయోగించే యాప్‌లే మన వ్యక్తిగత గోప్యతను అమ్ముతున్నాయా?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ యాప్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు… ప్రతి రోజు మన జీవితం వాటిపైనే ఆధారపడుతోంది. కానీ అదే స్మార్ట్‌ఫోన్ మన పేరు, ఫోన్ నెంబర్, ఆధార్, ఫోటోలు, బ్యాంక్ సమాచారం… ఇలా వ్యక్తిగత వివరాలు దేశం దాటి విదేశీ కంపెనీల చేతుల్లోకి చేరుతున్నాయన్న విషయం బయటపడటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మనం ఇన్‌స్టాల్ చేస్తున్న యాప్‌లు, అంగీకరిస్తున్న “I Agree” బటన్ వెనుక అసలు ఆట ఇదేనన్న ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల నివేదికల ప్రకారం, మన డేటా ఇప్పుడు కొత్త “బంగారం”. కంపెనీలు వినియోగదారుల వివరాలను మూడో పార్టీకి అమ్ముతున్నట్లు సమాచారం. అలాంటి డేటాతో నకిలీ లోన్స్, టార్గెట్‌డ్ స్కామ్‌లు, ఫేక్ పెట్టుబడులు, మోసపూరిత లింకులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మహిళలు పెద్ద మొత్తంలో లక్ష్యంగా మారుతున్నారు.

వాటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే – కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు కెమెరా, లొకేషన్, కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, పర్మిషన్స్ కోరడం. చాలామంది చదవకుండా అంగీకరించేస్తుండటంతో, వారి మొబైల్ “ప్రైవేట్ లైఫ్” మొత్తం కంపెనీల డేటా సర్వర్‌లకు వెళ్లిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. “మీరు మాట్లాడే మాటలు కూడా వినబడే అవకాశం ఉంది” అని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా డేటా సెక్యూరిటీ చట్టాలపై చర్చ మొదలైందే కాని, అమలు మాత్రం ఇంకా బలహీనంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారుల అనుమతి లేకుండా డేటా వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద కంపెనీలు డేటా దుర్వినియోగం చేస్తే భారీ జరిమానా విధించాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

డిజిటల్ యుగంలో సౌకర్యం పెరిగింది… కానీ మన గోప్యత, వ్యక్తిగత భద్రత ఖరీదు అవుతోంది. “మన డేటా – మన హక్కు” అనే నినాదంతో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మనం మౌనంగా ఉంటే మన వ్యక్తిగత జీవితం మార్కెట్‌లో అమ్ముడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

-Advertisement-