రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విజ్జేశ్వరంలో రికార్డు స్థాయి అభివృద్ధి పనులు: మంత్రి కందుల దుర్గేష్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విజ్జేశ్వరంలో రికార్డు స్థాయి అభివృద్ధి పనులు: మంత్రి కందుల దుర్గేష్

- విస్తృత పర్యటనలో పల్లె పండుగ పనుల పరిశీలన

- రూ.60 లక్షలకు పైగా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు

- నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందడుగు

విజ్జేశ్వరం, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కందుల దుర్గేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రెయిన్లు సహా పలు మౌలిక సదుపాయాల పనుల పురోగతిని పరిశీలిస్తూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డొంక రోడ్లను పూర్తి చేయగలిగినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో విజ్జేశ్వరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. గత 18 నెలల కాలంలోనే గ్రామంలో రూ.60 లక్షలకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు వెల్లడించారు. పల్లె పండుగ 1.0 కింద సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తయ్యిందని, ప్రస్తుతం ఎస్సీ–బీసీ కాలనీల్లో మరిన్ని రోడ్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి నిడదవోలు నియోజకవర్గానికి శాస్కి స్కీమ్‌, ఆర్ అండ్ బీ నిధుల ద్వారా భారీ మొత్తంలో రోడ్డు అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. గత ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని వెనక్కి నెట్టి, కూటమి ప్రభుత్వంలో నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Comments

-Advertisement-