రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైసీపీ వైఖరిపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వైసీపీ వైఖరిపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర విమర్శలు

  • శాసనమండలిలో చిత్రపటాల వ్యవహారంపై ఆగ్రహం
  • భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్య
  • సనాతన ధర్మంపై దాడులను ఖండించాలని పిలుపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్):
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆ పార్టీ నాయకుల వైఖరిపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో వైసీపీ ప్రజాప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో వ్యవహరించిన తీరు దారుణమని ఆయన విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం, తీర్థం పట్ల గతంలో కూడా అవమానకర వైఖరి ప్రదర్శించారని విమర్శించారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడిచిన ఘటనలను ప్రస్తావిస్తూ హిందూ ధర్మంపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో అంతర్వేది, రామతీర్థం వంటి ప్రాంతాల్లో ఆలయ విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రజలు వాటిని మర్చిపోలేదని పేర్కొన్నారు. సొంత మతాన్ని ఆరాధిస్తూ పర మతాన్ని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పే సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నాయకులపై ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వైఖరిని ప్రజలు సహించరని హెచ్చరించారు. సనాతన ధర్మం, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ప్రజలంతా ఖండించి తిప్పికొట్టాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-