రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్ర బడ్జెట్‌పై జగన్ ఘాటు విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాష్ట్ర బడ్జెట్‌పై జగన్ ఘాటు విమర్శలు

- ఇది ప్రజల బడ్జెట్ కాదని వ్యాఖ్య

- ఆదాయ లెక్కలు తప్పుల తడకలని ఆరోపణ

- హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తాడేపల్లి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని, తప్పుడు లెక్కలతో నిండిన మోసపూరిత పత్రం అని ఆయన అభివర్ణించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవని జగన్ ఆరోపించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం లక్షల కోట్లుగా వస్తుందని చెప్పినా వాస్తవ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి శాతం కూడా నిరాశాజనకంగా ఉందని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనుకబడిందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్ర ఆదాయం కొంతమందికి లాభపడుతోందని, పారదర్శకత లోపిస్తోందని అన్నారు. మహిళలకు నెలకు వెయ్యి ఐదు వందలు, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు నిధులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. అప్పుల వివరాలు బడ్జెట్‌లో స్పష్టంగా చూపించలేదని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రజల డబ్బుతో విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పారదర్శకమైన, నిజాయితీగల బడ్జెట్ అవసరమని జగన్ స్పష్టం చేశారు.

Comments

-Advertisement-