ఆన్లైన్ సేలింగ్లలో జాగ్రత్తలు తప్పనిసరి: తెలంగాణ పోలీసుల హెచ్చరిక
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఆన్లైన్ సేలింగ్లలో జాగ్రత్తలు తప్పనిసరి: తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- - ఫేక్ వెబ్సైట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన
- - సెర్చ్ ఫలితాల్లో ముందున్న సైట్లను నమ్మవద్దని విజ్ఞప్తి
- - అధికారిక లింకులు, రివ్యూలు పరిశీలించాలని సూచనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): ఆన్లైన్ సేలింగ్ పేరుతో పెరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఫేక్ వెబ్సైట్ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోళ్లు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సెర్చ్ ఇంజిన్లలో ముందుగా కనిపించే వెబ్సైట్లను అంధంగా నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. తక్కువ ధరలు, భారీ ఆఫర్ల పేరుతో ఆకర్షించే వెబ్సైట్లు ఎక్కువగా నకిలీవిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఒకే అక్షరం తేడాతో ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కొనుగోలు చేయడానికి ముందు అధికారిక వెబ్సైట్ అడ్రస్ను సరిచూసుకోవాలని, యూఆర్ఎల్లో ఎటువంటి తప్పులు లేవని నిర్ధారించుకోవాలని సూచించారు. అదనంగా, ఇతర వినియోగదారుల రివ్యూలు పరిశీలించడం ద్వారా వెబ్సైట్ విశ్వసనీయతను అంచనా వేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆన్లైన్ లావాదేవీల సమయంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వెబ్సైట్లను వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Student Desk
Comment Poster
Good
Reply to This Comment
Comments
