గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- విజయవాడలో లోక్ భవన్లో భేటీ
- బడ్జెట్ సమావేశాల ప్రసంగానికి కృతజ్ఞతలు
- రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ
విజయవాడ, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగానికి ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు సమాచారం. రాష్ట్ర పరిపాలన, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలసిన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Comments
