రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అమరావతిలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి ప్రపంచ స్థాయి రూపకల్పన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అమరావతిలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి ప్రపంచ స్థాయి రూపకల్పన

- ఉండవల్లిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష

- నమూనా భవన రూపురేఖల పరిశీలన

- ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఉండవల్లి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
అమరావతిలో నిర్మించబోయే రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ భవనంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై భవన నమూనాను పరిశీలించారు. రాష్ట్ర ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచేలా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మించాలన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో కూడిన జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, పరిశోధకులు, పాఠకులకు ఉపయోగపడే విధంగా సమగ్ర సదుపాయాలు ఉండాలని పేర్కొన్నారు. గ్రంథాలయం కేవలం పుస్తకాల నిల్వ స్థలం కాకుండా, డిజిటల్ వనరులు, పరిశోధన విభాగాలు, సమావేశ హాళ్లు, యువతకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలు కలిగిన సమగ్ర జ్ఞాన వేదికగా ఉండాలన్నారు. భవన రూపకల్పనలో సాంప్రదాయ శైలిని ప్రతిబింబిస్తూ ఆధునిక నిర్మాణ ప్రమాణాలను అనుసరించాలని ఆదేశించారు. అమరావతిని జ్ఞాన నగరంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుని వేగంగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Comments

-Advertisement-