రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శాసనమండలిలో ఉద్రిక్తత.. తోపులాటతో సభ వాయిదా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శాసనమండలిలో ఉద్రిక్తత.. తోపులాటతో సభ వాయిదా

  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చలో గందరగోళం
  • సోము వీర్రాజు వైపు దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు
  • పరిస్థితి అదుపులోకి రాక సభ వాయిదా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత కూడా ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేనురాజు తదుపరి ప్రశ్నకు అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ నిరసన కొనసాగుతుండగానే వీర్రాజుకు మైక్ ఇవ్వడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వారు వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లడంతో సభలో కలకలం రేగింది. కేవలం వాగ్వాదం మాత్రమే కాకుండా దాడి యత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. పరిస్థితి విషమించడంతో మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే స్పందించి సోము వీర్రాజుకు అండగా నిలబడ్డారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం కొనసాగడంతో సభ నియంత్రణ తప్పింది. చివరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్ మోషేనురాజు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Comments

-Advertisement-