రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హెలిప్యాడ్‌లోకి ఆవు.. అధికారుల్లో గందరగోళం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హెలిప్యాడ్‌లోకి ఆవు.. అధికారుల్లో గందరగోళం

  • సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ముందు ఊహించని ఘటన
  • భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించిన ఆవు
  • సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

బీహార్, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ముందు చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యక్రమం కోసం బెగుసరాయ్ జిల్లాకు రావాల్సి ఉండగా హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఒక ఆవు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించడం కలకలం రేపింది. సమృద్ధి యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో బెగుసరాయ్‌లోని పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాంగణానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెలిప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఇతర అధికారులు హెలికాప్టర్ రాక కోసం వేచి ఉన్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఒక ఆవు ఒక్కసారిగా బారికేడ్లు దాటి హెలిప్యాడ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆవు వేగంగా అక్కడి ప్రాంగణంలో పరుగులు తీయడంతో భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆవును బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంతసేపటి తర్వాత ఆవు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముఖ్యమంత్రి రాకకు ముందే పరిస్థితి సాధారణంగా మారింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతూ విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.

Comments

-Advertisement-