రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బడ్జెట్, రుణాలపై కీలక చర్చలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బడ్జెట్, రుణాలపై కీలక చర్చలు

- ఖమ్మం సహకార బ్యాంకు మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

- రైతుల ఆదాయ పెంపుపై దిశానిర్దేశం

- రికవరీపై అవగాహన కల్పించాలని సూచనలు

ఖమ్మం, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 128వ మహాజన సభ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చలు జరిగాయి. గత తీర్మానాల ధృవీకరణతో పాటు 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఖర్చుల నివేదికను సమీక్షించారు. అలాగే 2026–27 సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్‌ను ఆమోదించారు. సహకార సంఘాల ప్రస్తుత పరిస్థితి, సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ, రికవరీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా సహకార సంఘాల ద్వారా అందించే రుణాలను సమర్థంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రుణాల పంపిణీ పెంచాలని, దీనివల్ల పంట దిగుబడులు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం వంటి రంగాల్లో రైతులు ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. విభిన్న రంగాల్లో రైతులు ముందుకు సాగితే వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

రైతులకు మంజూరు చేసిన రుణాల రికవరీపై సహకార సంఘాలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు స్వచ్ఛందంగా రుణాలు చెల్లించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు.

Comments

-Advertisement-