రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కానూరులో ఉద్రిక్తత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కానూరులో ఉద్రిక్తత

  • ఇంటి కూల్చివేతకు ప్రయత్నించిన అధికారులు
  • యజమాని ప్రతిఘటనతో ఉద్రిక్త పరిస్థితి
  • పట్టా అందజేసి కూల్చివేత నిలిపివేత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

పెనమలూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్) :
పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇంటిని జేసీబీతో కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా యజమాని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సంఘటనతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ కూల్చివేత చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలో అక్కడికి స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం బాధిత కుటుంబానికి వెంటనే ఇంటి పట్టా అందజేశారు. దీంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Comments

-Advertisement-