రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దేశ రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేక ముద్ర: లోకేశ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

దేశ రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేక ముద్ర: లోకేశ్

- కార్యకర్తలే పార్టీ అసలైన బలం అని స్పష్టం

- ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను స్మరించిన మంత్రి

- ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు

మంగళగిరి, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్): దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జెండా మోసే కార్యకర్తలే పార్టీకి నిజమైన అధినేతలని లోకేశ్ స్పష్టం చేశారు. వారిని కాపాడుకోవడం తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో స్థాయికి కష్టపడి పనిచేసే కార్యకర్తలను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే భారీ నిధులు ఖర్చు చేసిన పార్టీగా టీడీపీ నిలిచిందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశానికి చేసిన సేవలను లోకేశ్ గుర్తుచేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలు చారిత్రాత్మకమని కొనియాడారు. చంద్రబాబు వయసు పెరిగినా, యువకుడి ఉత్సాహంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.

గత ప్రభుత్వంపై లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులతో భయపెట్టలేరని, టీడీపీని అణగదొక్కాలనుకున్నవారే ఇప్పుడు కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు అహంకారం విడిచి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లోకేశ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకునే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పారదర్శకత అవసరమని సూచించారు.

2024లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలందిస్తామని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-