రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత

  • చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపు
  • భారీగా చేరుకున్న ఫైబర్ నెట్ ఆపరేటర్లు
  • సమస్యలపై ఆపరేటర్ల హెచ్చరిక

ఉండవల్లి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నివాసం వద్దకు ఫైబర్ నెట్ ఆపరేటర్లు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునిస్తూ ఫైబర్ నెట్ ఆపరేటర్లు ముందుకు వచ్చారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ డిమాండ్లను వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ నినాదాలు చేశారు. తమను సీఎం ఇంటి వద్దకు రానివ్వకుండా, అంటు వ్యాధి సోకిన వారిలా తరిమి కొడుతున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

సమస్యలు పరిష్కారం కాకపోతే మరింత తీవ్రంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబాలతో సహా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనతో ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండగా, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

-Advertisement-