మిట్టల్ స్టీల్ ప్లాంట్పై అమర్నాథ్ విమర్శలు
మిట్టల్ స్టీల్ ప్లాంట్పై అమర్నాథ్ విమర్శలు
- ప్రభుత్వ హడావిడి పై ప్రశ్నలు
- పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయన్న ఆరోపణ
- గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు
విశాఖ, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు హడావిడి చేశారని ఆయన పేర్కొన్నారు. సాధించని ఘనత కోసం ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప వాస్తవ పరిస్థితులను వెల్లడించలేదని విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రావడానికి వైఎస్ జగన్ కారణమని అమర్నాథ్ తెలిపారు. దావోస్లో ఆదిత్య మిట్టల్తో జరిగిన సమావేశంలో జగన్ చేసిన విజ్ఞప్తి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పారు. 2022 ఆగస్టులో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతినిధులు వచ్చి భూములు పరిశీలించారని గుర్తుచేశారు. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్న చిత్తశుద్ధి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఎందుకు లేదని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 వేల ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని అమర్నాథ్ పేర్కొన్నారు. గత 24 నెలల్లో సుమారు 6500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడినట్లు చెప్పారు. జిందాల్ స్టీల్ వంటి సంస్థలను కూడా వెళ్లగొట్టారని, కోకకోలా సంస్థ అనకాపల్లి నుంచి వెనక్కి వెళ్లిపోయిన కారణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పుడు ప్రచారంతోనే కాలం గడిపేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా ఇంకా జగన్పై విమర్శలతోనే ముందుకు సాగుతోందని అన్నారు. వైజాగ్లో ప్రారంభించిన ఇనార్బిట్ మాల్ కూడా జగన్ హయాంలోనే ప్రారంభమైన ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు.
