రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మన్రేగా చట్ట పరిరక్షణ యాత్రలో వైఎస్ షర్మిల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మన్రేగా చట్ట పరిరక్షణ యాత్రలో వైఎస్ షర్మిల

  • ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • భీమడోలులో రచ్చబండ కార్యక్రమం నిర్వహణ
  • ఉపాధి పనుల తగ్గింపుపై ప్రజల ఆవేదన

ఏలూరు, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై మన్రేగా పథకం అమలుపై తమ సమస్యలను వెల్లడించారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన స్థానికులు మండలంలో మూడు వారాలకు పైగా ఉపాధి పనులు కల్పించలేదని తెలిపారు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు పనులు పండుగలా జరిగేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో గ్రామీణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ మన్రేగా పథకం గ్రామీణ కార్మికులకు ముఖ్యమైన జీవనాధారంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను కార్మికులకు వివరించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈ పథకం కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల శ్రామికులకు నష్టం కలిగే అవకాశాలపై కూడా కార్మికులకు వివరించినట్లు చెప్పారు. మన్రేగా పథకాన్ని బలోపేతం చేసి గ్రామీణ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Comments

-Advertisement-