రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బిలియనీర్ల కోసం కాదు… పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బిలియనీర్ల కోసం కాదు… పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

  • జిల్లా కలెక్టర్ల సమావేశంలో కీలక సూచనలు
  • సాంకేతికత ఆధారిత పాలనపై దృష్టి పెట్టాలని ఆదేశం
  • పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని సూచన
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ప్రభుత్వం పని చేసేది మిలియనీర్లు, బిలియనీర్ల కోసం కాదని, పేదల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరో జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన పాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు చేరువగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అమరావతి ప్రాంతంలో రహదారుల ఇరువైపులా చెట్లు, పూలతో అందంగా తీర్చిదిద్దినట్లే ఇతర ప్రాంతాల్లో కూడా అందమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడంతో పాటు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని పెంచాలని అన్నారు. డిజిటల్ పరిజ్ఞానంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. అలాగే మనమిత్ర అనే సమాచార సేవను ప్రజల్లోకి విస్తరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. సెప్టెంబర్ నాటికి పలు ప్రాజెక్టులు పూర్తి చేసి చర్యల నివేదికను ప్రజల ముందుంచుతామని అన్నారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని, జిల్లాల అభివృద్ధి బాధ్యతను కలెక్టర్లు స్వయంగా తీసుకోవాలని సూచించారు. మార్చి 23న ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను స్వంత గుర్తింపుతో మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల ప్రభావం దేశంపై కూడా పడుతుందని పేర్కొంటూ ప్రత్యామ్నాయ మార్కెట్లను అభివృద్ధి చేయడం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments

-Advertisement-