రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

10 వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా అదనపు ఎస్పీ

Tenth Exams results 2025 AP SSC exams results 2025 Tenth class results 2025 BSEAP.gov.in results Tenth results updates Tenth Exams updates Tenth Exams
Peoples Motivation

10 వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా అదనపు ఎస్పీ

Tenth Exams updates

రాయచోటి, మార్చి 17 (పీపుల్స్ మోటివేషన్):-

అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) యం.వెంకటాద్రి, సోమవారం రాయచోటి టౌన్ నేతాజీ సర్కిల్ పరిధిలోని, ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఈవో డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం తో కలిసి సందర్శించారు, అనంతరం మాసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్, లక్కిరెడ్డిపల్లి మోడల్ స్కూల్ లో జరుగుతున్న 10 వ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. 

🎯పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను, తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును అదనపు ఎస్పీ పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

🟣పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్న అన్నమయ్య జిల్లా పోలీసులు..

🟢విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు

🔵పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు

✅మార్చి 17 నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

🌈పరీక్ష వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ కేంద్రాల సమీపంలో ఎవరూ గుంపులుగా గుమికూడకుండా నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు లేకుండా చూస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్/ప్రింటింగ్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు కొనసాగుతున్నంత సేపు మొబైల్ పెట్రోలింగ్ బృందం నిరంతరం పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్ష ముగిశాక ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పరీక్ష పూర్తయ్యేవరకు సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Comments

-Advertisement-