రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TENTH RESULTS: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి

Telangana tenth results 2025 link www bse telangana gov in 2025 telangana ssc exam time table 2025 10th class ts ssc result 2025 telangana SSC results
Peoples Motivation

TENTH RESULTS: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి

• మధ్యాహ్నం ఒంటి గంటకు పదో తరగతి ఫలితాలు విడుదల..

• ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

• ఫలితాలను https://bse.telangana.gov.in లో ఒక్క క్లిక్‌తోనే చూసుకోవచ్చు

Telangana tenth results 2025 link www bse telangana gov in 2025 telangana ssc exam time table 2025 10th class ts ssc result 2025 telangana SSC results

తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి పరీక్షల ఫలితాల నేడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగ్గా దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in లో ఒక్క క్లిక్‌తోనే పొందొచ్చు.

ఇకపై మార్కుల మెమోలు ఇలా: పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా దాదాపు 20 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్‌తో పాటుగా క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ) ఇచ్చేవారు.

పాస్, ఫెయిల్: ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు.

సీబీఎస్‌ఈ తరహాలోనే: వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. సీబీఎస్‌ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. ఇక్కడా అదేవిధంగా ఉంటుందా? అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇

https://bse.telangana.gov.in

results.bse.telangana.gov.in

Comments

-Advertisement-