విపత్తులపై సమగ్ర ప్రతిస్పందన కోసం ప్రత్యేక సమీక్ష
విపత్తులపై సమగ్ర ప్రతిస్పందన కోసం ప్రత్యేక సమీక్ష
సమయోచిత చర్యలు – ప్రజల భద్రతకే ప్రాధాన్యం
అనకాపల్లి, మే 28: అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన ప్రతిస్పందన ద్వారా ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్న అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ, విపత్తుల నివారణపై మరింత బలమైన చర్యలు చేపడుతోంది. పారిశ్రామిక ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్సర్క్యూట్లు వంటి ప్రమాదాలకు సంబంధించి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విపత్తుల సందర్భంలో పోలీస్ అధికారులు SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం సమన్వయంతో స్పందించాల్సిన అవసరాన్ని వివరించారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లావ్యాప్తంగా సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రధానాంశాలు:
గతంలో అచ్యుతాపురం, పరవాడ ప్రాంతాల్లో జరిగిన ఘటనలను పరిశీలించి, SOP రూపొందించడమైంది.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ పర్యవేక్షణ అధికారిగా ఉంటూ విపత్తు తీవ్రత ఆధారంగా విధులు పంపిణీ చేస్తూ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ (CMG) ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రమాద స్థలానికి జోనల్ కమాండ్లు వెంటనే చేరుకునే విధంగా చర్యలు.
అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు, SDRF/NDRF మరియు స్థానిక పోలీసులు కలిసి సమిష్టిగా స్పందన.
ప్రమాదం సంభవించిన వెంటనే పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ స్పందనతో చర్యలు చేపడతారు.
కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం పంపి బాధితుల వివరాలు సేకరణ.
అంబులెన్సుల ద్వారా బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి, తక్షణ వైద్యం అందించనుంది.
క్యూఆర్టీ బృందాలు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని రైట్ గేర్తో సంఘటన స్థలానికి పంపించి భద్రత కల్పిస్తారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలలో ఆందోళన తలెత్తకుండా అవగాహన చర్యలు చేపడతారు.
జవహర్లాల్ నెహ్రూ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సహకారంతో, సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా పోలీసులకు అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గారితో పాటు
అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, పరవాడ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మీ , గఫూర్, రమేష్, రామకృష్ణ, మన్మధరావు, సంజీవరావు,
పరవాడ ఇన్స్పెక్టర్
ఆర్.మల్లికార్జున రావు, అచ్యుతాపురం ఇన్స్పెక్టర్ ఎన్.గణేష్, రాంబిల్లి ఇన్స్పెక్టర్ సి.హెచ్.నరసింగరావు, అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, అనకాపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎలమంచిలి సిఐ ధనుంజయ రావు, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ అప్పన్న మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రతను తన ప్రధాన బాధ్యతగా తీసుకుని, సమిష్టి సమన్వయంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది అని ఎస్పీ స్పష్టం చేశారు.