యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ నివ్వాలి
యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ నివ్వాలి
ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంద్ర-2025 అంతిమ లక్ష్యం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి, మే 30: ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర-2025 కార్యక్రమ అంతి లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకై యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికై ఈ నెల 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకు వెళ్లేందుకు అధికారులు అంతా సమిష్టిగా కృషిచేయాలని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఈ నెల 21 నుండి జరుగుచున్న యోగాంద్ర-2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జూన్ 21 న జరుగనున్న 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మెడీ పాల్గొంటున్న సందర్బంగా ప్రపంచానికి యోగ విశిష్టతను తెలియపర్చడమే కాకుండా యోగాంధ్రప్రదేశ్ గా ప్రపంచంలో రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ ఉండాలని, అందకు తగ్గట్టుగా తగు ముందస్తు ఏర్పాటు చేయాలన ఆదేశించారు. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాలను నెల రోజుల పాటు నిర్వహించి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పరిరక్షించే విధంగా చైతన్య పర్చేందుకు, ఇప్పటికే కమ్యునికేట్ చేసిన కార్యాచరణ ప్రణాకకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో పండుగ వాతావరణంలో యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
లక్ష్యాన్ని అదికమిస్తూ 5,353 మందిని మాస్టర్ ట్రైనీలుగా తీర్చిదిద్దడం జరిగిందని, అయితే దాదాపు 2.00 కోట్ల మంది ప్రజలకు యోగా శిక్షణను ఇచ్చేందుకు 1.25 లక్షల మంది శిక్షకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మందకొడిగా సాగుచున్నదన్నారు. జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి, జూన్ 3 నుండి మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టరను ఆయన ఆదేశించారు. దాదాపు 2.00 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యే విధంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంబించగా ఇప్పటి వరకూ కేవలం 1.04 కోట్లు మంది మాత్రమే తమ పేర్లును నమోదు చేసుకోవడం జరిగిందని, కొన్ని జిల్లాలు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో వెనుబడి ఉన్నాయని, సంబందిత జిల్లా కలెక్టర్లు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. టూరిస్టు, ఐకానిక్ ప్రాంతాల్లో 103 కార్యక్రమాలను, 26 థీమ్ బేస్డు యోగా కార్యక్రమాలను నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్థేశించగా ఇప్పటి వరకూ కేవలం ఐకానిక్ ప్రాంతాల్లో 26, థీమ్ బేస్డు యెగా కార్యక్రమాలు 5 మాత్రమే నిర్వహించడం జరిగిందన్నారు. షెడ్యూలు ప్రకారం నిర్ణీత కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ రాష్ట్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 14,999 యోగా పోటీలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్థేశిస్తే ఇప్పటి వరకూ కేవలం 8,800 యోగా పోటీలను మాత్రమే నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల నిర్వహణను వేగవంతం చేయాలన జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా జూన్ 2 నుండి మండల స్థాయిలో 682, జూన్ 9 నుండి జిల్లా స్థాయిలో 26 యోగా పోటీలను నిర్వహించి సకాలంలో పూర్తి చేస్తే, జూన్ 16 నుండి రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో పాల్గొనే పౌరుల నమోదు కార్యక్రమాన్ని వేగ వంతం చేయాలని, ప్రతి మండలం, వార్డు మరియు గ్రామంలో పౌర నమోదు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. శిక్షకుల శిక్షణలు నాణ్యతతో ప్రోటోకాల్ల ప్రకారం నిర్వహించాలన్నారు. థీమాటిక్ యోగా పోటీలలో కనీసం 5000 మంది మరియు ప్రతి పర్యాటక గమ్యస్థానంలో 1000 మంది పాల్గొనేలా చూడాలన్నారు. థీమాటిక్ మరియు టూరిస్ట్ ఈవెంట్లను డ్రోన్ లతో వీడియోలను చిత్రీకరించాలన్నారు. మొత్తం రిపోర్టింగ్ యోగాంద్ర పోర్టల్లో జరగాలని, రిజిస్ట్రేషన్లు, శిక్షణలు, మ్యాపింగ్ మరియు ఈవెంట్లకు సంబంధించిన డేటాను తప్పకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలో జరిగే సెలబ్రిటీ ఈవెంట్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో పర్యాటక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జూన్ 8న రాష్ట్రంలోని 75 ప్రదేశాలలో సీనియర్ సిటిజన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు SERP, GSWS, WCD శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. హోర్డింగ్ల ఏర్పాటు, సోషల్ మీడియా ప్రచారం తదితర సోషల్ మీడియా ప్రచారాన్ని సమాచార పౌర సంబంధరాల శాఖ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కమిషనర్ వీరపాండ్యన్, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.