పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలి
పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి, మే 30: ప్రధాన మంత్రి సూర్యఘర్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపన ప్రగతిని సమీక్షించారు. పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపన కై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 వేల మంది ధరఖాస్తుచేసుకోగా, ఇప్పటి వరకూ కేవలం 12,172 యూనిట్లను మాత్రమే స్థాపించడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 10 వేల యూనిట్ల స్థాపన లక్ష్యాన్ని నిర్థేశించగా, పలనాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్.టి.ఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు సి.ఆర్.డి.ఏ. కూడా లక్ష్యాల సాధనలో చాలా వెనుబడి ఉందన్నారు. యూనిట్లు స్థాపనను వేగవంతం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉన్నతాధికారులు అందరూ ఈ లక్ష్య సాధనలో జిల్లా కలెక్టర్లకు పూర్తిగా సహకరించాలని ఆదేశించారు. అదే విధంగా ఈ యూనిట్లు స్థాపనకు బ్యాంకు రుణాలు మంజూరు విషయంలో పలు బ్యాంకుల నుండి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే విధంగా త్వరలో జరిగే ఎస్.ఎల్.బి.సి.లో బ్యాంకర్లకు ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది ఆయన స్పష్టం చేశారు.
సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.