రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు లను మూడేళ్లో పూర్తి చేస్తాం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు లను మూడేళ్లో పూర్తి చేస్తాం

  • విజయవాడ మెట్రో రైల్ కు నేడో, రేపో టెండర్లు పిలుస్తాం
  • పి. నారాయణ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి

మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శుక్రవారం లెనిన్ సెంటర్ లోని సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విశాఖపట్టణం, విజయవాడలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఫీజుబుల్టీ రెపోర్టు స్టడీ చేయడానికి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ముందుగా విశాఖపట్టణంలో మెట్రో రైల్ కు టెండర్లు ఇవ్వడం జరిగిందని, నేడో, రేపో విజయవాడ మెట్రోకు టెండర్లు పిలవటం జరుగుతుందన్నారు. కేంద్రం మెట్రో రైల్ నిర్మాణానికి పాలసీ మార్చిందని మారిన పాలసీ ప్రకారం మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మెట్రో రైల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా 20 శాతం, కేంద్రం వాటాగా 20, మిగతాది కేంద్రం అనుమతితో సాప్ట్ లోన్ ను 30 సంవత్సరాల కాలపరిమితితో తక్కువ వడ్డీ రేటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి కేంద్రం అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పీజుబులిటీ చేపట్టి మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టకుండా పక్కన పడేసిందన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందన్నారు. ఇవాళ ప్రపంచవాక్షప్తంగా ట్రాఫిక్ సమస్య ఉందని దానికి పరిష్కారంగా మెట్రో రైళ్ల నిర్మాణాలను బెంగళూరు, హైద్రాబాద్, నాగపూర్ తదితర ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందన్నారు. మిక్స్ డ్ డబుల్డ్ పర్మిషన్స్ ను ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని క్రింది అంతుపులో పార్కింగ్, మొదటి అంతస్టులో కమర్షియల్ నిర్మాణాలు, రెండో అంతస్థులో రెసిడెన్షియల్ గా ఉండేలా పర్మిషన్స్ ఇవ్వడంతో వాక్ టూ వర్క్ లా పరిస్థితులు మారిపోతున్నాయన్నారు. జంక్షన్స్ వద్ద ట్రాఫిక్ కు ఏవిధమైన ఆటంకాలు

ఏర్పడకుండా మొదటి ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ వాహనాలు, రెండో ఫైఓవర్ పై మెట్రో ట్రైన్ వెళ్లేలా నిర్మాణాలు ఉంటాయని దీనివల్ల వాహనాదారులకు ఏ విదమైన ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. విశాఖపట్టణం మెట్రో రైల్ నిర్మాణాలు విశాఖపట్టణం మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు పేజీల్లో పనులు చేపట్టడం జరుగుతుందని మొదటి పేజ్ లో మొత్తం 46 కిమీ మెట్రో లైన్ నిర్మాణం 42 స్టేషన్లతో మొత్తం రూ. 11,490 కోట్ల అంచనాతో మూడు క్యారిడార్ల లో మెట్రో రైల్ నిర్మాణం. మొదటి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిమీ మెట్రో లైను 29 స్టేషన్ల తో నిర్మాణం... రెండో కారిడార్ గురుద్వారా జంక్షన్

నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.7 కిమీ మెట్రో లైను ఆరు స్టేషన్ల తో నిర్మాణం, కారిడార్ మూడు ను తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిమీ మెట్రో లైను 7 మెట్రో స్టేషన్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.

విజయవాడ మెట్రో ను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొదటి పేజ్ ను రూ. 10,118 కోట్ల అంచనా వ్యయంతో 32.40 కిమీ మేర నిర్మాణం. మొదటి కారిడార్ ను 25.9 కిమీ ను పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు రెండో కారిడార్ ను పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి పెనమలూరు వరకు చేపట్టనున్నారన్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామకృష్ణా రెడ్డి ల మధ్య అవగాహన ఒప్పందాన్ని మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రతినిధులు. విజ‌య‌వాడ మెట్రో డిజైన్ లు, సాంకేతిక‌త‌, ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కు టిప్సాతో, విశాఖ కు శిస్ట్రా క‌న్స‌ల్టెన్సీల‌తో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది..

అమరావతి రాజధాని రైతులకు జరీబు భూములకు రూ. 50,000, నాన్ జరీబు భూములకు రూ. 30,000 చెల్లించడం జరిగిందన్నారు. 18,638 మంది రైతులకు రూ. 163.67 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రదారాలను నమ్మవద్దని రాజధాని రైతులను కోరారు. బ్యాంకు ఇబ్బులు, ఎకౌంట్స్ ఇబ్బందులతో ఇంకా కొద్దిమందికి డబ్బులు వారి ఎకౌంట్లలో జమ కాకపోయినా త్వరలోనే వాటిని కూడా సరిచేసి అందిస్తామన్నారు. ఏపీ సచివాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న స్కావెంజర్స్, స్వీపర్స్ కు రాజధాని ప్రాంతంలో అందించే పెన్షన్ ను ప్రభుత్వం ఇచ్చే విదంగా ఆదేశాలు ఇచ్చామన్నారు.

Comments

-Advertisement-