రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

  • విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పిస్తున్నాం
  • అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం
  • విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
  • మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి

కర్నూలు / చిన్నటేకూరు,అక్టోబర్ 15 :


గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు కర్నూలు జిల్లా చిన్నటేకూరులోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి, అంబేద్కర్ గురుకులాల కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ......గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పిస్తున్నాం. అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం. రూ. 143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టాం. అనారోగ్యానికి గురైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆసుపత్రుల్లో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక వైద్యాధికారిని నియమించాం.విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి.విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మంత్రి డా. డోలా  బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Comments

-Advertisement-