రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం 

— మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటింపు

న్యూఢిల్లీ, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో జరిగిన ప్రాణ నష్టం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-