డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల రహితంగా తీర్చిద్దిదాలని సీఎం చంద్రబాబు ఆదేశం
డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల రహితంగా తీర్చిద్దిదాలని సీఎం చంద్రబాబు ఆదేశం
• ఆర్ & బీ రహదారుల అభివృద్ధి పనులపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
• రోడ్ల అభివృద్ధి - మరమ్మత్తుల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్ లకు సీఎం ఆదేశం
• నేటికీ పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం
• కేవలం ఏడాది వ్యవధిలో రూ. 2500 కోట్లతో 5471 కి.మీ రోడ్ల అభివృద్ధికి అనుమతులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే..
కూటమి ప్రభుత్వంలో రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటిని గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. నేడు ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం. టీ కృష్ణబాబు, ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి - మరమ్మత్తుల పనుల తీరుపై ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శిలను సీఎం ఆదేశించారు.. అదే సమయంలో ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదే సమయంలో రహదారులు మరమ్మతు పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దని, అత్యుత్తమంగా ఉండేలా చూడాలన్నారు. రహదారుల అభివృద్ధిలో అత్యున్నత సాంకేతిక విధానాలను, వినూత్న మెటీరియల్ ను ఉపయోగించే విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులకున్న ప్రాధాన్యత గుర్తించి అందుకు తగిన విధంగా నిధులు కేటాయించడం జరిగింది. గత ఏడాది గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మిషన్ పాత్ హోల్ ఫ్రీ లో భాగంగా రూ. 861 నిధులతో రాష్ట్రంలో రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం రెన్యువల్ కూడా చేపట్టకపోవడం, రహదారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వంటి కారణాల వల్ల రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయి.. అయినప్పటికీ ఈ ఏడాది రహదారుల నిర్వహణ మరియు ఇంప్రూవ్మెంట్ కోసం రూ. 2500 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రూ. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1250 కి.మీ జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ ఇప్పటికే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించడం జరిగింది. ఇవి కాకుండా రూ. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు 1450 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయడానికి గుత్తేదారులను గుర్తించి పనులు అప్పగించడం జరిగింది.
మరో 2,104 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 274 పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందుకోసం రూ. 1000 కోట్లతో ఆయా పనులకు టెండర్లు పిలవడం జరిగింది. డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ పనులన్నింటినీ గుత్తేదారులు గుర్తించి పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.
ఇవి కాకుండా వివిధ కారణాలతో గుత్తేదారులకు అప్పగించి రద్దయిన.. రూ. 277 కోట్లతో 607 కి.మీ రహదారుల నిర్వహణ & అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది.. రాబోయే 2 – 3 రోజుల్లో ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇవి కాకుండా మరో రూ. 233 కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేయడం జరుగుతుంది.. ఇందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాది వ్యవధిలో రూ. 2500 కోట్లతో 5471 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతోంది... ఇప్పటి వరకు వర్షాకాలం మరియు వరుస తుఫానులు కారణంగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్న క్రమంలో ఈ పనులు ప్రారంభం కాలేదు.. వచ్చేవారంలో ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి మరియు మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరుగుతుంది.. ఇవి కాకుండా 9101 కిలోమీటర్లు అత్యవసర మరమ్మత్తుల కోసం రూ. 500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుంది.. మొంథా తుఫాను వల్ల దెబ్బతిన్న దాదాపు 4794 కిలోమీటర్లు రహదారులను మరమ్మత్తు చేయడం కోసం ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుంది.
గత ప్రభుత్వం 2 సంవత్సరాలు గుత్తేదారులు చేసిన పనులకు నిధులు విడుదల చేయకుండా ఉన్న పరిస్థితి.. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి సుమారుగా రూ. 4000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఈ బిల్లులను మరియు గత సంవత్సరం చేసిన పనులకు సంబంధించిన CRIF మరియు NDB నిధులతో చేపట్టిన బిల్లులను దశలవారీగా చెల్లింపులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా రూ. 1900 కోట్ల రూపాయల బిల్లులను గుత్తేదారులకు చెల్లించడం జరిగింది. ప్రతి నెల గుత్తేదారుల పెండింగ్ బిల్లులు చెల్లింపు చేసే విధంగా ప్రణాళికలు ఆర్థిక శాఖ అనుమతితో చేపట్టడం జరిగింది.
ఈ విధంగా గుత్తేదారుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాలు ఇప్పటికే పలుమార్లు నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల పుట్టపర్తి, విశాఖపట్నంలోనూ, ఎప్పటికప్పుడూ విజయవాడలోనూ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశాలు నిర్వహించడం పనుల పురోగతిని సమీక్షించడం జరుగుతుంది.. ప్రజలకు మెరుగైన రహదారుల కల్పించడంలో ఇప్పటికే ప్రారంభించిన పనులన్నీ డిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేయాలని ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుంది.
