రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

- లోయలోకి దూసుకెళ్లిన ప్రయాణికుల బస్సు

- ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిర్మౌర్ జిల్లాలోని రేణుకాజీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హరిపుర్ధార్ మార్కెట్ సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు సుమారు 60 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, బస్సు అదుపు తప్పడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అతివేగం, రోడ్డు పరిస్థితులు లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Comments

-Advertisement-