రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మధిరలో టీడీపీ దూకుడు.. 10వ వార్డులో బోడేపూడి రేవతి ఘన విజయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మధిరలో టీడీపీ దూకుడు.. 10వ వార్డులో బోడేపూడి రేవతి ఘన విజయం

- 166 ఓట్ల భారీ మెజారిటీ

- తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం

- అనుచరుల సంబరాలు మిన్నంటాయి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మధిర, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణలో మధిర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి ఘన విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నేడు జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే రేవతి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వకుండా ఓటర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఏకపక్షంగా సాగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

చివరి ఫలితాల ప్రకారం బోడేపూడి రేవతి 334 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి పెదపూడి సుధాకర్ 168 ఓట్లు మాత్రమే పొందారు. 166 ఓట్ల భారీ మెజారిటీతో రేవతి విజయం సాధించారు. ఈ ఫలితంతో మధిరలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. స్థానికంగా పార్టీ బలాన్ని మరోసారి చాటుకున్నామని నాయకులు పేర్కొన్నారు.

Comments

-Advertisement-