మధిర భవిష్యత్తే మా లక్ష్యం: భట్టి విక్రమార్క
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మధిర భవిష్యత్తే మా లక్ష్యం: భట్టి విక్రమార్క
రాజకీయాల కోసం కాదు… రాబోయే 50 ఏళ్ల అవసరాల కోసం ఎన్నికలు
‘ఆదర్శ పట్టణం’గా మధిరను తీర్చిదిద్దుతాం
మధిర, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):
మధిర మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం రాజకీయాల కోసమే కాదని, మధిర భవిష్యత్తును నిర్ణయించే కీలక సందర్భమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో మధిరను ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఆలోచించి వినియోగించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, మార్పు కోరుకునే ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి మధిర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని కోరారు. మన మధిర మన బాధ్యత అని పేర్కొన్న భట్టి విక్రమార్క, పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మధిరను ముందుకు నడిపిస్తుందని, ప్రజలు మార్పుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
