ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం రాష్ట్రపతి విశాఖకు రాక
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం రాష్ట్రపతి విశాఖకు రాక
- విమానాశ్రయంలో ఘన స్వాగతం
- గవర్నర్, ఉప ముఖ్యమంత్రి ఆతిథ్యం
విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారికంగా ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. విశాఖపట్నంలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన నౌకాదళ బలగాలు పాల్గొననున్నాయి. రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Comments
