రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్
ముంబై – ఫిబ్రవరి 13 – పీపుల్స్ మోటివేషన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నూతన కెప్టెన్గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ను నియమించినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గత సీజన్లో కొన్ని మ్యాచ్లకు నాయకత్వం వహించిన పరాగ్కు ఈసారి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
గతంలో జట్టును నడిపించిన సంజూ శాంసన్ మరో జట్టుకు వెళ్లడంతో పరాగ్కు అవకాశం లభించినట్లు తెలుస్తోంది. యువ ఆటగాడిగా ఐపీఎల్లో ఇప్పటికే మంచి అనుభవం సొంతం చేసుకున్న పరాగ్ 84 మ్యాచ్లు ఆడి 1566 పరుగులు సాధించాడు. 2024 సీజన్లో 573 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గత సీజన్లోనూ వేగవంతమైన బ్యాటింగ్తో 393 పరుగులు నమోదు చేశాడు. బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీసి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు.
ఇప్పటికే 2008లో షేన్ వార్న్ సారథ్యంలో తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ కప్ అందుకోలేకపోయింది. ఈసారి యువ నాయకుడి నేతృత్వంలో రెండో టైటిల్ కోసం జట్టు వేట ప్రారంభించనుంది. పరాగ్ నాయకత్వం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.
24 ఏళ్ల యువ కెప్టెన్ బాధ్యతలను ఎలా నిర్వహిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సీజన్లో రాజస్థాన్ ప్రదర్శనపై అందరి దృష్టి నిలిచింది.
