రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు

- విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం

- పూర్ణకుంభంతో స్వాగతం

- అనంతరం పులివెందులో ప్రజాదర్బార్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

పులివెందుల, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. నందీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా ఆయన నందిపల్లికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జగన్‌కు పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూలమాలను సమర్పించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమ సన్నిధిలో యజ్ఞయాగాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం సందర్భంగా భక్తులతో కూడా ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి స్థానికులతో చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం అనంతరం జగన్ పులివెందుల చేరుకుని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా విని పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Comments

-Advertisement-