ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు చిన్నారుల హత్య
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు చిన్నారుల హత్య
- చందన్ పార్క్లో అర్ధరాత్రి ఘాతుకం
- భర్త పరారీ.. కుటుంబ కలహాలే కారణమా?
- ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): దేశ రాజధాని ఢిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. చందన్ పార్క్ ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళతో పాటు మూడు, నాలుగు, ఐదేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా, ఘటన తర్వాత మహిళ భర్త పరారైనట్లు పోలీసులు తెలిపారు. చందన్ పార్క్లో ముంచన్ కెవాత్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆజాద్పూర్ మండిలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం స్థానికులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా, మహిళ మరియు ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో మృతదేహాలుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితులు నిద్రలో ఉండగానే ఈ దాడి జరిగినట్లు, ప్రతిఘటించే అవకాశం లేకుండా నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటన అనంతరం ముంచన్ పరారీలో ఉండటంతో, కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితుడు వెళ్లిన దిశపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Comments
