రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహిళలను అవమానించే వ్యాఖ్యలు సరికాదు: మంత్రి అనిత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మహిళలను అవమానించే వ్యాఖ్యలు సరికాదు: మంత్రి అనిత

  • అంబటి వ్యాఖ్యలపై తీవ్ర ఆక్షేపణ
  • ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సవాల్
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సమాధానం ఏమిటని ప్రశ్న

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
మహిళలను అవమానించేలా మాట్లాడిన నేతలు సమాజానికి తప్పు సందేశం ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇటీవలి వ్యాఖ్యలపై స్పందిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గౌరవమైన సభల్లో అలాంటి నేతల కోసం మాట్లాడడం అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు తల్లి గురించి మాట్లాడారని ఆరోపణలు చేస్తున్నారని, అయితే అందుకు ఆధారాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రాజకీయాలు సమాజానికి మేలు చేయవని అనిత పేర్కొన్నారు. అంబటి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని, మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం అంగీకారయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

Comments

-Advertisement-