రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేది లేదు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేది లేదు

- కక్ష సాధింపు రాజకీయాలకు కాలం చెల్లింది

- గుంటూరులో కూటమి వైఫల్యాలపై ప్రజల గళం

గుంటూరు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేది లేదని, కక్ష సాధింపు రాజకీయాలకు కాలం చెల్లిందని గుంటూరులో ప్రజలు స్పష్టంగా చాటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలు ఒక్కటయ్యారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యాయం గెలవాలని, ప్రజల పక్షాన నిలిచే నాయకత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని జనం నినాదాల ద్వారా వెల్లడించారు. కూటమి పాలనలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలబడే నాయకుడికి నీరాజనం పలికారు.

ఈ సందర్భంగా గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల స్వరం అణచివేయాలని చూస్తే తగిన విధంగా ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ పోరాటమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గుంటూరులో జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Comments

-Advertisement-