రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గ్యాస్ కొరతతో స్విగ్గి, జొమాటో బంద్ నిర్ణయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గ్యాస్ కొరతతో స్విగ్గి, జొమాటో బంద్ నిర్ణయం

- ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు నిలిపివేయాలని హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం

- ప్రతి సోమవారం హోటళ్లు మూసివేతపై ఆలోచన

- మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత

అమరావతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గి, జొమాటో సేవలను నిలిపివేయాలని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గ్యాస్ కొరత కారణంగా హోటళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హోటల్ యజమానులు తెలిపారు. అందువల్ల తొలుత స్విగ్గి, జొమాటో ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఆర్డర్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిస్థితి మెరుగుపడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను మూసివేయాలని కూడా అసోసియేషన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం పడిందని పేర్కొంటున్నారు. దీని కారణంగా దేశంలో గ్యాస్ సరఫరా తగ్గి హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Comments

-Advertisement-