ఏపీలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఏపీలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన
- గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం
- 25–30 రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలు
- హోటళ్లకు వాణిజ్య సిలిండర్లపై పరిమితులు
అమరావతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ వినియోగానికి సరిపడే ఎల్పీజీ నిల్వలు సుమారు 25 నుంచి 30 రోజుల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం సుమారు 1.7 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల రీఫిల్లింగ్పై కొంత పరిమితులు విధించినట్లు హోటళ్లు, రెస్టారెంట్లు తెలిపాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో నౌకాయాన రవాణాలో ఆలస్యాలు చోటుచేసుకోవడంతో భవిష్యత్తులో సరఫరాపై అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇంధన సరఫరాపై పడుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
Comments
