మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
- శ్రీకాకుళం జిల్లా పోలీసుల సాయంతో రూ.4.08 లక్షలు
- నగదు చెక్కును అందజేసిన అదనపు ఎస్పీ కె.వి. రమణ
- హోంగార్డుల ఐక్యతకు నిదర్శనమని ప్రశంస
శ్రీకాకుళం, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): శ్రీకాకుళం జిల్లా హోంగార్డు యూనిట్కు చెందిన హోంగార్డు పాలవలస భాస్కరరావు విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల ఫిబ్రవరిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ ఆర్థిక సహాయం అందించింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాస్కరరావు సతీమణి పి. రాజేశ్వరికి అదనపు ఎస్పీ కె.వి. రమణ రూ.4 లక్షల 8 వేల నగదు చెక్కును అందజేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా తమ ఒక రోజు దినసరి గౌరవ వేతనాన్ని అందించి ఈ సహాయాన్ని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన లేదా పదవీ విరమణ పొందిన హోంగార్డుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డులు తమ వేతనాన్ని విరాళంగా అందిస్తున్నారని అదనపు ఎస్పీ తెలిపారు. సహచర ఉద్యోగి కుటుంబానికి తోడుగా నిలుస్తూ హోంగార్డులు ఐక్యతను చాటుతున్నారని ఆయన కొనియాడారు. అందించిన నగదును కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సిహెచ్ గోపినాథ్, ఆర్ఐ వెంకటరమణ, ఆర్ఎస్సై హరనాథ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
