గిరిజనుల అంశంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గిరిజనుల అంశంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
‘వనవాసి’ పదంపై కాంగ్రెస్ ఆగ్రహం
కుల గణన అవసరంపై స్పష్టం
మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు
వడోదర, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జరిగిన ‘ఆదివాసీ అధికార్ సంవిధాన సమ్మేళన్’లో పాల్గొన్న ఆయన, గిరిజనులను ‘వనవాసి’ అని సంభోదించడం వెనుక ఉద్దేశ్యాన్ని ప్రశ్నించారు. శతాబ్దాలుగా గిరిజనులకు చెందిన నీరు, అడవులు, భూములపై వారి యాజమాన్య హక్కులను నిరాకరించడానికే ఈ పదాన్ని సృష్టించారని ఆరోపించారు. ఆదివాసీలు ఈ దేశపు అసలైన యజమానులని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘వనవాసి’ అనే పదం గిరిజనులు కేవలం అడవుల్లో నివసించే వారిగా చూపిస్తుందని, అయితే ‘ఆదివాసి’ అనే పదం వారికి భూమిపై హక్కులను స్పష్టం చేస్తుందని అన్నారు. గిరిజన నాయకుడు బిర్సా ముండా ఆశయాలను కాపాడటంలో బీజేపీ విఫలమవుతోందని విమర్శించారు. అభివృద్ధి పేరిట గిరిజనుల భూములను సరైన పరిహారం లేకుండా తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో గిరిజనులు తమ వాటాను పొందాలంటే కుల గణన కీలకమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కుల గణన ద్వారా ఆదివాసీల అసలు జనాభాను గుర్తించి, ప్రభుత్వ వ్యవస్థలలో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించవచ్చని తెలిపారు. దేశ జనాభాలో ఆదివాసీలు 9 శాతం, దళితులు 15 శాతం, ఓబీసీలు 50 శాతం ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులు, చిన్న పరిశ్రమలు నష్టపోతాయని అన్నారు. అమెరికా ఉత్పత్తులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని ప్రసంగంలో కొత్తదనం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మిడిల్ ఈస్ట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
Comments
