రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బైక్ పొగతో నలుగురు మృతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బైక్ పొగతో నలుగురు మృతి

  • ఇంట్లోనే బైక్ ఆన్ చేయడంతో విషాదం
  • తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి
  • అన్నమయ్య జిల్లాలో దుర్ఘటన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అన్నమయ్య, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బైక్‌ను ఆన్ చేసి ఉంచడంతో వచ్చిన విషపూరిత పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజవీధిలో చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సమాచారం ప్రకారం బోరుకొచ్చిన బైకును ఇటీవల రిపేర్ చేయించుకున్నారు. మరమ్మతుల అనంతరం బైక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి కొంతసేపు ఆన్‌లో ఉంచాలని మెకానిక్ సూచించినట్లు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు బైకును ఇంటి లోపలే ఆన్ చేసి ఉంచి రాత్రంతా అలాగే వదిలేశారు. బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విషపూరిత వాయువు గదిలో నిండిపోవడంతో అదే గదిలో నిద్రిస్తున్న తాత, ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఉదయం వరకు ఎవరూ గమనించకపోవడంతో వారు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులు ఇంటి పైకప్పుపై నిద్రించడం వల్ల వారికి ప్రమాదం తప్పింది. ఉదయం కుటుంబ సభ్యులు కిందికి వచ్చి చూసే సరికి నలుగురు అపస్మారక స్థితిలో ఉండటంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Comments

-Advertisement-